Posts Slider
Andhra Pradesh
TTD: దొంగతో రాజీ కుదుర్చుకుంటారా..? తిరుమల ఘటనపై రచ్చ..!!
తిరుమల పరకామణీలో (Parakamani) దొంగతనం వ్యవహారం ఇప్పుడు వైసీపీ (YCP), కూటమి (NDA) మధ్య రచ్చ రాజేస్తోంది. భూమన కరుణాకర్ రెడ్డి (Bhuamana Karunakar Reddy) టీటీడీ (TTD) ఛైర్మన్ గా ఉన్నప్పుడు ఓ ఉద్యోగి పలుమార్లు దొంగతనాలకు పాల్పడ్డాడు. దీనిపై టీటీడీ కేసు పెట్టింది. అయితే లోక్ అదాలత్ లో దీనిపై రాజీ కుదుర్చుకున్నారు. దొంగతనం చేసిన వ్యక్తితో ఎలా రాజీ కుదుర్చుకుంటారని ప్రస్తుత టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి (Bhanu Prakash Reddy) ప్రశ్నిస్తున్నారు. పైగా దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని బెదిరించి వైసీపీ నేతలు, టీటీడీ అధికారులు కొందరు ఆస్తులు రాయించుకున్నారని, త్వరలోనే ఆ వివరాలన్నీ బయటకు వస్తాయని ఆయన చెప్తున్నారు.
అయితే రవికుమార్ దొంగతనం చేస్తున్నప్పుడు గుర్తించి పట్టుకున్నదని తమ హయాంలోనేనని, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు పట్టుకోలేదని భూమన కరుణాకర్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. రవికుమార్ కుటుంబసభ్యులు పశ్చాత్తాపంతో చేసిన తప్పు ఒప్పుకుని టీటీడీకి కోట్ల విలువైన ఆస్తులను రాసిచ్చారని, అందుకే రాజీ కుదిరిందని భూమన అంటున్నారు. రవికుమార్ నుంచి తాను కానీ, తన బినామీలు కానీ లబ్దిపొందినట్లు ఆధారాలుంటే బయటపెట్టాలని భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. రవికుమార్ దొంగతనం వ్యవహారంపై సీఐడీతో కాకుండా సీబీఐ విచారణ జరిపించాలని, అప్పుడే నిజాలు బయటకు వస్తాయని చెప్తున్నారు.
అయితే భూమన వాదనను భానుప్రకాశ్ రెడ్డి ఖండించారు. స్వామివారి సొమ్ము దొంగతనం చేస్తే రాజీ కుదుర్చుకునే అధికారం వీళ్లకు ఎవరిచ్చారని భానుప్రకాశ్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. భూమన బోర్డు సభ్యుడిగా ఉన్నప్పుడు రవికుమార్ దొంగతనం చేస్తుండగా పట్టుకున్నారని, ఆయన ఛైర్మన్ గా ఉన్నప్పుడు రాజీ కుదుర్చుకున్నారని మరోసారి ఆయన ఉద్ఘాటించారు. సెటిల్మెంట్ ద్వారా 40 కోట్లకు పైగా విలువైన ఆస్తులను టీటీడీకి కల్పించినప్పుడు భూమన అప్పుడే ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు వెల్లడించలేదని ప్రశ్నించారు. రవికుమార్ కుటుంబసభ్యులకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని కోరారు. రవికుమార్ బతికి ఉన్నాడో లేదో అనుమానంగా ఉందన్నారు. రవికుమార్ నుంచి తీసుకున్న సొమ్ము భూమన, ధర్మారెడ్డి, జగన్ కు చేరిందని భానుప్రకాశ్ రెడ్డి ఆరోపించారు. ఈ కేసును విచారించడానికి సీబీఐ అక్కర్లేదని, ఎస్సై స్థాయి అధికారి చాలని స్పష్టం చేశారు. రెండు మూడు రోజుల్లో మరిన్ని వివరాలు బయటకు వస్తాయన్నారు.
పరకామణీలో దొంగతనం చేసిన వ్యక్తితో రాజీ కుదుర్చుకోవడంపై హైకోర్టు సీరియస్ అవడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. లోక్ అదాలత్ లో ఎలా రాజీ కుదుర్చుకుంటారని హైకోర్టు ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై లోతైన సమగ్ర విచారణ జరపాలని ఆదేశించింది. దీంతో టీటీడీ బోర్డు ఈ కేసును మళ్ళీ తెరపైకి తెచ్చింది. వైసీపీ హయాంలో ఏ జరిగిందనేదానిపై ఆరా తీస్తోంది. ఇంతలో టీటీడీ బోర్డు సభ్యుడిగా ఉన్న భాను ప్రకాశ్ రెడ్డి, నాటి రాజీ వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చారు. ఈ వ్యవహారం ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. దొంగతనం చేసిన వ్యక్తితో రాజీ కుదుర్చుకోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Telangana
Revanth Reddy: మేడారం అభివృద్ధి ప్రణాళికపై ముగిసిన సీఎం సమీక్ష
ఈ నెల 23 న మేడారంకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy). అభివృద్ధిపై క్షేత్రస్థాయిలో సందర్శించి సమ్మక్క సారలమ్మ పూజారులను సంప్రదించనున్న సీఎం. పూజారుల సూచనల మేరకు వారి ఆమోదంతో అభివృద్ధిపై డిజైన్లను విడుదల చేయనున్న ముఖ్యమంత్రి. మేడారం జాతర పనులకు సంబంధించి టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించిన సీఎం. పూజారులు కోరిన విధంగా ప్రస్తుతం ఉన్న ఆలయ ఆవరణను మరింత విస్తరించాలని ఆశిస్తున్న ప్రభుత్వం.
గద్దెలను యథాతథంగా ఉంచి సంప్రదాయాలను తూచా తప్పకుండా గౌరవించాలని ఆదేశించిన సీఎం. గిరిజన సంప్రదాయం ఉట్టిపడేలా స్వాగత తోరణం డిజైన్లు ఉండాలన్న సీఎం. ఆలయం పరిసర ప్రాంతాల్లో ఆ ప్రాంత సంప్రదాయ వృక్షాలు ఉండేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం. 23న సీఎంతో పాటు మేడారం వెళ్లనున్న మంత్రులు, గిరిజన ఎంపీలు, ఎంఎల్సీలు, ఎమ్మెల్యేలు, సంబంధిత అధికారులు. మేడారం జాతర పనులపై 23 న మేడారంలో సమీక్షించనున్న సీఎం రేవంత్ రెడ్డి.
Posts Carousel
Latest News
Beauty Trailer: నాగ చైతన్య చేతుల మీదుగా గుండెలను హత్తుకునే ‘బ్యూటీ’ ట్రైలర్
ఓ మంచి ప్రేమ కథను, అంతకు మించిన కుటుంబ విలువలు, ఫాదర్ డాటర్ రిలేషన్, ఎమోషనల్ కంటెంట్ తో వస్తున్న చిత్రం ‘బ్యూటీ’ (Beauty). జీ స్టూడియోస్, మారుతీ టీం ప్రొడక్ట్స్, వానర సెల్యూలాయిడ్ సంయుక్తంగా ‘బ్యూటీ’ సినిమాని నిర్మించారు. అలాంటి…
Beauty: ‘బ్యూటీ’ అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ఉంటుంది.. నిర్మాత విజయ్ పాల్ రెడ్డి అడిదల
ఏ మారుతి టీం ప్రొడక్ట్, వానరా సెల్యూలాయిడ్, జీ స్టూడియో బ్యానర్లపై విజయ్ పాల్ రెడ్డి అడిదల నిర్మించిన చిత్రం ‘బ్యూటీ’ (Beauty). అంకిత్ కొయ్య, నీలఖి, నరేష్, వాసుకి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లేని…
Kishkindhapuri Review: భయపెట్టిన ‘కిష్కిందపురి’
తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 3/5నిర్మాణ సంస్థ : షైన్ స్క్రీన్స్తారాగణం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్సంగీతం : సామ్ సిఎస్, సినిమాటోగ్రఫీ : చిన్మయ్ సలాస్కర్ఎడిటర్ : నిరంజన్ దేవరమానే, ప్రొడక్షన్ డిజైన్ : మనీషా ఎ దత్ఆర్ట్…
WAR2: ‘వార్ 2’ సంచలనం.. నార్త్ అమెరికాలో ప్రీ-సేల్స్లో అత్యంత వేగంగా $100Kతో రికార్డ్ క్రియేట్ చేసిన చిత్రం
YRF స్పై యూనివర్స్ నుంచి రాబోతోన్న ‘వార్ 2’ చిత్రంపై ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి ఉన్న భారీ హైప్, క్రేజ్ని చాటేలా ప్రీ సేల్స్ జరుగుతున్నాయి. ‘వార్ 2’ సినిమాకు సంబంధించి నార్త్ అమెరికాలో ఇప్పటికే…
Nandamuri: సీనియర్ డైరెక్షన్ లో మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీ ప్లానింగ్..?
నందమూరి నరసింహ బాలకృష్ణ(Nandamuri Balakrishna) కుమారుడు మోక్షజ్ఞ తేజ (Nandamuri Mokshagna), సినిమా ఎంట్రీ పై ఎప్పటినుంచో ప్రచారం జరుగుతున్న సరే, ఇప్పటివరకు అది ముందుకు అడుగు పడలేదు. గత ఏడాది అధికారిక ప్రకటన వచ్చిన సరే ఇప్పటివరకు సినిమా మాత్రం…
